మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు అరుదైన​ పురస్కారం..!

A rare award for Satya Nadella

0
34

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లకు ప్రతిష్ఠాత్మక సీకే ప్రహ్లాద్ ‘గ్లోబల్ బిజినెస్​ సస్టెయినబిలిటీ లీడర్​షిప్​’ అవార్డు వరించింది. కర్బన ఉద్గార రహిత కంపెనీగా మైక్రోసాఫ్ట్​ను తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషికి గాను అదే సంస్థకు చెందిన మరో ముగ్గురితో కలిసి నాదెళ్ల ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రపంచ దేశాల్లో ప్రైవేట్ రంగంలో అసాధారణ విజయాలు, సుస్థిరత సాధించిన వారికి వ్యాపార దిగ్గజం భారతీయ అమెరికన్​ సీకే ప్రహ్లాద్ పేరిట ఈ​ పురస్కారాన్ని కార్పొరేట్ ఎకో ఫోరమ్(సీఈఎఫ్​) సంస్థ 2010 నుంచి అందిస్తోంది.

మైక్రోసాఫ్ట్ అధినేత, వైస్ ఛైర్మన్ బ్రాడ్ స్మిత్​, చీఫ్​ పైనాన్షియల్ ఆఫీసర్​ అమీ హుడ్, చీఫ్​ ఎన్విరాన్​మెంట్ ఆఫీసర్​ లుకాస్​ జొప్పాతో కలిసి సత్య నాదెళ్ల ఈ అవార్డును పంచుకున్నారు. ఒకే సంస్థకు చెందిన నలుగురు వ్యక్తులు.. పర్యావరణ పరిరక్షణ దిశగా కృషి చేయడం ఇదే తొలిసారి” అని సీఈఎఫ్​ వ్యవస్థాపకుడు ఎంఆర్​ రంగస్వామి తెలిపారు.

కార్పొరేట్ సంస్థల్లో నాయకత్వం ఎలా ఉండాలో అన్నదానికి సరికొత్త ఉదాహారణగా నిలిచారని చెప్పారు. మైక్రోసాఫ్ట్ వ్యాపార వ్యూహానికి స్థిరత్వమే ప్రధానమైన అంశాన్ని చాటి చెప్పారని పేర్కొన్నారు. సీఈఎఫ్​ అడ్వైజరీ బోర్డులోని 24 మంది వేసిన ఓట్ల ద్వారా సీకే ప్రహ్లాద్ విజేతలను ఎంపిక చేసినట్లు సీఈఎఫ్​ తెలిపింది.