రైల్వే ప్రయాణికులకు అలెర్ట్..పలు రైళ్ల రద్దు..దారి మళ్లింపు

0
38

రైల్వే ప్రయాణికులకు అలెర్ట్..చెన్నై-గూడూరు సెక్షన్‌లో సాంకేతిక పనుల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

నెల్లూరు–సూళ్లూరుపేట మధ్య నడిచే మెమూ రైళ్లను (06746/06745) ఈ నెల 22న పూర్తిగా రద్దు చేశారు. విజయవాడ–చెన్నై సెంట్రల్‌ (12711/12712) రైళ్లను ఈ నెల 22న గూడూరు–చెన్నై సెంట్రల్‌ మధ్య, హైదరాబాద్‌–తాంబరం (12760) రైలును ఈ నెల 26న చెన్నైబీచ్‌–తాంబరం మధ్య పాక్షికంగా రద్దు చేశారు.

దారి మళ్లించిన రైళ్ల వివరాలిలా..

చెన్నై ఎగ్మోర్‌–ముంబై సీఎస్‌టీ ఎక్స్‌ప్రెస్‌ (22158) ఈ నెల 27న తాంబరం, చెంగల్‌పట్టు మీదుగా దారి మళ్లింపు.

పుదుచ్చేరి–న్యూఢిల్లీ (22403) ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 16న చెంగల్‌పట్టు, అరక్కోణం, పెరంబూర్, కొరుక్కుపేట స్టేషన్‌ల మీదుగా దారి మళ్లింపు.

కాకినాడ–చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌ (17644) ఈ నెల 26న పెరంబూర్, అరక్కోణం మీదుగా మళ్లింపు.

ఇండోర్‌–కొచువేలి ఎక్స్‌ప్రెస్‌ (22645) ఈ నెల 21న గూడూరు, రేణిగుంట, మేల్పాక్కం, కాట్పాడి స్టేషన్‌ మీదుగా మళ్లింపు.

ధన్‌బాద్‌–అలప్పుజ ఎక్స్‌ప్రెస్‌ (13351) ఈ నెల 21న గూడూరు, రేణిగుంట, మేల్పాక్కం మీదుగా దారి మళ్లింపు.

కాకినాడ–చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌ (17652) ఈ నెల 26న అరక్కోణం, కాంచీపురం మీదుగా దారి మళ్లింపు.