ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు ఇలా..

0
38

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర రెక్కలు తొడిగింది. 10 గ్రాముల మేలిమి పుత్తడిపై రూ.60 పెరగగా..వెండి ధర కిలోకు రూ.898 ఎగసింది.

హైదరాబాద్​లో పది గ్రాముల పసిడి ధర రూ.50,600గా ఉంది. కిలో వెండి ధర రూ.68,630 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 10 గ్రాముల బంగారం రేటు రూ.50,600కు, కేజీ వెండి ధర రూ.68,630కు చేరింది.

విశాఖపట్నంలో పది గ్రాములకు పుత్తడి ధర రూ.50,600గా ఉంది. కిలో వెండి ధర రూ.68,630కు పెరిగింది.