గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు బిగ్ అలర్ట్..సైబర్‌ కేటుగాళ్ల నుండి తప్పించుకోండిలా..

Big alert for Google Chrome users .. Avoid cyber hackers ..

0
49

గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కీలక హెచ్చరిక జారీ చేసింది. 97.0.4692.71 కంటే పాత వెర్షన్‌ గూగుల్‌ క్రోమ్‌ వాడుతున్న వారి డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌లు సైబర్‌ దాడికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరించింది. ఈ మేరకు దానికి సంబంధించి కొన్ని విషయాలను వెల్లడించింది.

ఈ మేరకు ఇటీవల కాలంలో జరిగిన దాడులను తెలియజేసింది. వీటిని దృష్టిలో పెట్టుకొని వినియోగదారులందరూ గూగుల్‌ క్రోమ్‌ తాజా వెర్షన్‌కు అప్‌డేట్‌ కావాలని అలర్ట్ చేసింది. తద్వారా గూగుల్‌ క్రోమ్‌లోని పలు సాంకేతిక లోపాలకు పరిష్కారం లభించడమే కాకుండా..సిస్టమ్స్‌పై సైబర్‌ కేటుగాళ్లకు నియంత్రణ సాధ్యపడదని వెల్లడించింది.

మరోవైపు మొబైల్స్‌కు సంబంధించి గూగుల్‌ క్రోమ్‌ యాప్‌తో పాటు ఇతర యాప్‌లను ఎప్పుటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూ ఉండాలని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా హ్యాకర్ల దాడి నుంచి తప్పించుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే అనుమానాస్పదంగా అనిపించే యాప్‌లు‌, ఈమెయిల్స్‌, వ్యక్తిగత సమాచారం అడిగే లింక్‌ల జోలికి వెళ్లొద్దని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇటువంటి లింక్‌లు ప్రమాదకర స్పైవేర్లను సిస్టమ్స్‌లోకి జొప్పిస్తాయని గుర్తు చేసింది.