బిగ్​బుల్ పై కాసుల వర్షం..పది నిమిషాల్లోనే రూ.186 కోట్ల లాభం!

0
43

వరుస నష్టాలతో కుదేలైన స్టాక్​ మార్కెట్​లు మంగళవారం మాత్రం ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండియా బిగ్​బుల్​ రాకేశ్​ ఝున్​ ఝున్​వాలాపై కాసులు వర్షం కురిసింది. కేవలం పది నిమిషాల్లో ఏకంగా రూ. 186 కోట్లు గడించారు ఝున్​ఝున్​వాలా.

సోమవారం ఎన్​ఎస్ఈ సెషన్​ క్లోజింగ్​ నాటికి రూ.2,398 ఉన్న టైటాన్​ షేర్​ విలువ మార్కెట్​ ఓపెనింగ్​ సెషన్​లో రూ. 23.95 పెరిగి.. రూ.2,435 లకు చేరింది. ఇదే విధంగా టాటా మోటార్స్​ షేర్​ కూడా రూ. 4.70 పెరిగి రూ.476.15కి చేరింది. దీంతో కేవలం పదే నిమిషాల్లో రూ. 186 కోట్ల ఝున్​ఝున్​వాలా పోర్ట్​ఫోలియోలో వచ్చి చేరాయి.

టైటాన్​లో రాకేశ్​కు 3,37,60,395 షేర్లు ఉండగా ఆయన సతీమణి రేఖా ఝున్​ఝున్​వాలా 95,40,575 షేర్లు కొనుగోలు చేశారు. వీరిద్దరికీ కలిపి మొత్తం 4,33,00,970 షేర్లు ఉన్నాయి. టాటా మోటార్స్​లో రాకేశ్​కు 3,67,50,000 షేర్లు ఉన్నాయి.