కోలుకున్న దేశీయ మార్కెట్లు..1500 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్​

0
47

దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు నష్టాల్లోంచి ఒక్కరోజులోనే కోలుకున్నాయి. మంగళవారం బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ ఏకంగా 1564 పాయింట్లు పెరిగి.. 59 వేల 537 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 446 పాయింట్ల లాభంతో 17 వేల 759 వద్ద సెషన్​ను ముగించింది.

అన్ని రంగాల సూచీలు గణనీయంగా పుంజుకున్నాయి. ఆటో, బ్యాంకింగ్​, లోహం, ఆయిల్​ అండ్​ గ్యాస్​, విద్యుత్​, రియాల్టీ రంగాలకు చెందిన సూచీలు 2-3 శాతం మేర రాణించాయి.

సెన్సెక్స్​ 30 ప్యాక్​లో అన్ని మంచి లాభాలను గడించాయి. బజాజ్​ ఫిన్​సర్వ్​ అత్యధికంగా 5 శాతానికిపైగా పెరిగింది. బజాజ్​ ఫినాన్స్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, టెక్​ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్​ కూడా పుంజుకున్నాయి.