మగువలకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం ధర..ఏపీ, తెలంగాణలో ఇలా..

0
50

మహిళలకు శుభవార్త..అలంకరణకు మహిళలు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఇప్పటిదాకా బంగారం ధరలు పెరగగా తాజాగా తగ్గుముఖం పట్టాయి.

ఏపీ​, తెలంగాణలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.570 మేర పడిపోయింది. ప్రస్తుతం బంగారం రూ.52,440 పలుకుతోంది. వెండి ధర సైతం పడిపోయింది. కేజీ వెండి ధర రూ.900 పతనమై.. ప్రస్తుతం రూ.54,000 వద్ద ఉంది.

హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.51,870గా ఉంది. కిలో వెండి ధర రూ.54,000 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.51,870 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.54,000గా ఉంది.