మహిళలకు శుభవార్త..తగ్గిన బంగారం ధర

0
48

మహిళలకు శుభవార్త..అలంకరణకు మహిళలు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఇప్పటిదాకా బంగారం ధరలు పెరగగా తాజాగా తగ్గుముఖం పట్టాయి.

పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.130 తగ్గి ప్రస్తుతం రూ.51,870 పలుకుతోంది.

మరోవైపు కేజీ వెండి ధర రూ.600కు పైగా పెరిగింది. ప్రస్తుతం రూ.53,805 వద్ద ఉంది.

హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర రూ.51,870గా ఉంది. కిలో వెండి ధర రూ.53,805 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.51,870 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.53,805గా ఉంది.