చరిత్ర సృష్టించిన టెక్​ దిగ్గజం యాపిల్​..3 ట్రిలియన్​ డాలర్ల తొలి కంపెనీగా ఘనత!

History-making tech giant Apple is credited with being the first company to make $ 3 trillion!

0
38

టెక్​ దిగ్గజం యాపిల్​ మరో అరుదైన రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా 3 ట్రిలియన్​ డాలర్ల (రూ. 3 లక్షల కోట్లు) మార్కెట్​ విలువను సాధించిన తొలి సంస్థగా యాపిల్ నిలిచింది. సంస్థ షేర్లు 3 శాతం పెరిగి 182.82 డాలర్లు దాటిన క్రమంలో యాపిల్​ ఈ ఘనత సాధించింది.

యాపిల్​ సంస్థ.. 2018లో 1 ట్రిలియన్​ డాలర్లు, 2020 ఆగస్టులో 2 ట్రిలియన్​ డాలర్ల మార్కును అందుకుంది. 2021లో సంస్థ షేర్ల విలువ 35 శాతం మేర పెరిగింది. యాపిల్​ ఉత్పత్తుల్లో ఐఫోన్​ 13తో పాటు ఇతర స్మార్ట్​ఫోన్​లకు విశేష ఆదరణ లభిస్తుండటం సంస్థకు సానుకూలంగా మారింది. గత సెప్టెంబర్​తో ముగిసిన త్రైమాసికానికి అమ్మకాలు 83బిలియన్​ డాలర్లు దాటాయి.

తాజాగా 3 ట్రిలియన్​ డాలర్ల మార్కును యాపిల్​ అందుకోగా..మరికొన్ని సంస్థలు కూడా త్వరలోనే ఆ మైలురాయికి చేరే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం.. మైక్రోసాఫ్ట్​ కంపెనీ విలువ 2.5 ట్రిలియన్​ డాలర్లుగా ఉండగా.. గూగుల్​ మాతృసంస్థ ఆల్ఫబెట్​ విలువ 2 ట్రిలియన్​ డాలర్లుగా ఉంది. ఈ-కామర్స్​ దిగ్గజం ఆమెజాన్​(1.7ట్రిలియన్​ డాలర్లు), ఎలాన్​ మస్క్​కు చెందిన టెస్లా(1.2ట్రిలియన్​ డాలర్లు).. ఈ రేసులో కాస్త వెనకంజలో ఉన్నాయి.