రూ.120 దాటేసిన పెట్రోల్ ధర…ఎక్కడంటే?

Petrol price exceeds Rs 120 ... where?

0
31

దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఈరోజు ఇదే ట్రెండ్ కొనసాగింది. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దేశీ ఇంధన ధరలు పెరగడం ఇది వరుసగా నాలుగో రోజు కావడం గమనార్హం. మధ్యప్రదేశ్‌లోని సాట్నా, అలిరాజ్‌పూర్‌లో ప్రీమియం పెట్రోల్ ధర ఏకంగా రూ.120 దాటేసింది.

ఇక హైదరాబాద్‌లో అయితే శనివారం పెట్రోల్ ధర పెరిగింది. లీటరుకు 37 పైసలు పైకి కదిలింది. దీంతో పెట్రోల్ ధర రూ.111.55కు చేరింది. డీజిల్ రేటు కూడా ఇదే దారిలో నడిచింది. డీజిల్ ధర లీటరుకు 38 పైసలు పెరిగింది. దీంతో డీజిల్ ధర రూ.104.70గా ఉంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ గుంటూరు అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ రేటు 35 పైసలు పెరిగింది. దీంతో లీటరు పెట్రోల్ ధర రూ.113.18కు చేరింది. డీజిల్ కూడా ఇదే దారిలో నడిచింది. డీజిల్ ధర 37 పైసలు పెరుగుదలతో రూ.105.77గా ఉంది.