అక్టోబర్ 1 నుంచి ఆర్బీఐ కొత్త రూల్స్..ఆన్‌లైన్‌ లావాదేవీలు మరింత సురక్షితం

0
37

త్వరలో డెబిట్ కార్డు, క్రెడిట్‌ కార్డు రూల్స్‌ మారనున్నాయి. కార్డ్‌ ఆన్‌ ఫైల్‌ టోకనైజేషన్‌ అమల్లోకి రానుంది. కొత్త నిబంధనల అమలుతో డెబిట్, క్రెడిట్ కార్డుల చెల్లింపులు మరింత సురక్షితంగా ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతోంది.

తాజా నిబంధనల ప్రకారం..కస్టమర్ ఆన్‌లైన్‌లో డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌తో లావాదేవీలు జరిపినప్పుడల్లా ఖాతాకు సంబంధించిన అన్ని వివరాలు ఎన్‌క్రిప్టెడ్ కోడ్‌లో సేవ్ అవుతాయి. అంటే ఏదైనా ఆన్‌లైన్‌లో లేదా యాప్‌లో డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌తో లావాదేవీ చేసినప్పుడు, దాని వివరాలు కంపెనీ సర్వర్‌లో సేవ్ అయ్యే విధానం ఇప్పటి వరకు అమలులో ఉంది. మళ్లీ ఆన్‌లైన్‌లో లేదా యాప్‌లో చెల్లింపుల సమయంలో కంపెనీ మళ్లీ పూర్తి వివరాలు అడగకుండా సేవ్‌ చేసుకుంటుంది.

అక్టోబర్ 1 నుంచి కంపెనీ సర్వర్లలో డేటా స్టోర్ చేయడానికి కుదరదని ఆర్బీఐ చెబుతోంది. వారు కార్డ్‌కి సంబంధించిన వివరాలన్నీ ఎన్‌క్రిప్టెడ్ కోడ్‌లో సేల్‌ అవ్వనున్నాయి. ఇలా కార్డు వివరాలు ఎన్‌క్రిప్టెడ్ కోడ్‌లో ఉన్నందున లావాదేవీ సురక్షితంగా ఉంటుంది. హ్యాకింగ్, సైబర్ మోసాల నుంచి కాపాడేందుకే ఈ విధానాన్ని ప్రవేశ పెట్టినట్లు ఆర్బీఐ తెల్పింది. అయితే నిజానికి జూలై 1 నుంచి ఈ విధానం అమల్లోకి రావలసి ఉంది. కానీ కొంత ఆలస్యంగా అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.