ఘోర ప్రమాదం..ఐదుగురు యువకులు దుర్మరణం

0
40

హిమాచల్ ప్రదేశ్ ఉనా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పంజాబ్ రిజిస్ట్రేషన్ తో ఉన్న ఓ కారు కుతారు కలాన్ లో ఓ స్తంభాన్ని ఢీ కోట్టింది. దీనితో కారు పక్కనే ఉన్న పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.