ప్రమాదం ఒక్కటే..ప్రాణాలే ముగ్గురివి!

Accident is the only one..there are three lives!

0
35

తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి గంగానగర్‌ వద్ద రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ సమయంలో లారీలో ఉన్న కాటన్ బ్యాగ్స్.. పక్కనే వెళుతున్న ఆటోపై పడ్డాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న దంపతులతో పాటు 3 నెలల చిన్నారి మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.