ఫ్లాష్: పాఠశాలలో దారుణం..స్వల్ప వివాదం కారణంగా గొంతుకోసిన విద్యార్థి

0
38

గచ్చిబౌలి పరిధిలోని గురుకుల పాఠశాలలో దారుణ హత్య చోటు చేసుకుంది. స్వల్ప వివాదం కారణంగా ఓ విద్యార్ధి తోటి విద్యార్ధి గొంతును అన్యాయంగా కోసాడు. దీంతో తీవ్రంగా గాయపడిన  బాలుడిని ఆసుపత్రికి తరలించగా..చికిత్స చేసిన డాక్టర్లు అతడికి ప్రాణాపాయం లేదని నిర్దారించారు. రాత్రి సమయంలో టిఫిన్ తింటుండగా ఉప్మా చేయి మీద పడిందని ఇద్దరు విద్యార్థుల మధ్య వాగ్వాదం చెలరేగినట్టు తెలుస్తుంది. ఆ కోపంతో అర్ధరాత్రి సమయంలోఈ హత్యకు పాల్పడినట్టు సమాచారం తెలుస్తుంది.