నంద్యాలలో కానిస్టేబుల్ దారుణ హత్య..ఉలిక్కిపడ్డ పోలీస్ శాఖ

0
43

ఏపీలో కానిస్టేబుల్ దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. నంద్యాల పట్టణంలోని రాజ్ థియేటర్ సమీపంలో సుమారు రాత్రి 10.30 గంటల సమయంలో కానిస్టేబుల్ సురేంద్ర రాత్రి ఇంటికి వెళ్లే సమయంలో కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు.

అనంతరం అక్కడ నుంచి పట్టణ శివారులోని చెరువుకట్ట ప్రాంతానికి తీసుకొని వెళ్లి కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ హత్య ఉదాంతంతో పోలీస్ శాఖ ఒక్కసారిగా ఉల్లిక్కిపాటుకు గురైంది. విషయం తెలిసిన వెంటనే పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా కానిస్టేబుల్ సురేంద్ర హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.