ఢిల్లీలో దారుణం.. నడిరోడ్డుపై బాలికను కత్తితో పొడిచి హత్య

-

Delhi |రోజురోజుకు దేశంలో పాశవికంగా ప్రవర్తించే వారి సంఖ్య పెరిగిపోతోంది. మృగాలకు మారుతూ అత్యంత హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి దారుణ ఘటనే దేశరాజధాని ఢిల్లీ(Delhi)లో జరిగింది. 16 ఏళ్ల బాలికను 20ఏళ్ల యువకుడు అత్యంత క్రూరంగా పొడిచి చంపాడు. రోహిణి ప్రాంతంలోని షాబాద్‌ డెయిరీ ప్రాంతానికి చెందిన బాలికకు సాహిల్ అనే స్నేహితుడు ఉన్నాడు. వీరి మధ్య ఇటీవల విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నడుచుకుంటూ వెళ్తున్న బాలికపై ఆ యువకుడు విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. 20 సార్లు పొడవడంతో పాటు 10 సార్లు బండరాయితో తలపై దాడి చేశాడు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇంత దారుణం జరుగుతున్నా ఎవ్వరూ అతడిని నిలువరించడానికి ప్రయత్నించలేదు. ఈ దారుణ ఘటనంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పరారీలో ఉన్న నిందితుడు సాహిల్‌ను యూపీలో పోలీసులు పట్టుకున్నారు. మరోవైపు ఈ ఘటనను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Kejriwal) తో పాటు మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాలి మలివాల్ తీవ్రంగా ఖండించారు.

- Advertisement -
Read Also:
1. హీరోయిన్‌కు వార్నింగ్ ఇచ్చిన అల్లు అర్జున్ భార్య
2. మణిపూర్‌లో మళ్లీ హింస.. పోలీసు సహా ఐదుగురి మృతి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

చంద్రబాబు నాకు గురువు కాదు.. సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్..

టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ది గురుశిష్యుల...

తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు

తెలంగాణలో రైతు భరోసా(Rythu Bharosa) నిధుల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం...