మణిపూర్‌లో మళ్లీ హింస.. పోలీసు సహా ఐదుగురి మృతి

-

జాతి ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌(Manipur)లో వివాదంలో ఆజ్యం పోసేలా విధ్వంసానికి, హత్యలకు పాల్పడుతున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతాబలగాలు చర్యలు తీసుకున్నాయని, ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 40మంది ఉగ్రవాదులు మరణించారని ముఖ్యమంత్రి ఎన్‌.బీరెన్‌ సింగ్‌ ఆదివారం ప్రకటించారు. దీంతో పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) మణిపూర్‌ పర్యటనకు సిద్ధమవగా.. మరోమారు హింస చెలరేగింది. నిన్న మరోమారు అల్లర్లు రేకెత్తాయి. మరోసారి చెలరేగిన హింసాకాండలో ఓ పోలీసు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గాయపడ్డారు. వీరితో కలుపుకుని ఇప్పటి వరకు ఈ ఘర్షణల్లో మృతి చెందినవారి సంఖ్య 80కి పెరిగింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ ఘర్షణలు జరిగినట్టు పోలీసులు తెలిపారు. అత్యాధునిక ఆయుధాలు ధరించిన ఉగ్రవాదులు సెరౌ, సుగుణు ప్రాంతాల్లోని పలు ఇళ్లపై తూటాల వర్షం కురిపించినట్టు పేర్కొన్నారు. కాగా, గత రెండు రోజుల్లో 40 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ తెలిపారు. ఇంఫాల్(Imphal) లోయలోని శివారు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా పౌరులపై జరుగుతున్న హింసాత్మక దాడులు ముందుస్తు ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు మణిపూర్‌(Manipur)లో పర్యటించనున్నారు. ఘర్షణలకు కారణమైన మెయిటీ, కుకీ తెగలను సంయమనం పాటించాలని కోరారు.

- Advertisement -
Read Also:
1. ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు దుర్మరణం
2. ఏపీ ప్రజలకు టీడీపీ వరాల జల్లు.. అదిరిపోయిన మేనిఫెస్టో

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...

Malla Reddy | మల్కాజిగిరిలో నువ్వే గెలుస్తున్నావ్.. ఈటలతో మల్లారెడ్డి

తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy)...