ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు దుర్మరణం

-

Prakasam |ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలపాలయ్యారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ(Vijayawada) నుంచి హిందూపురం(Hindupuram) వెళ్తున్న ఆర్టీసీ బస్సు, గుంటూరు వైపు వెళ్తున్న కారు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వినుకొండ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతూ మరోకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ ఘటనపై కేసునమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మృతులు విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. విజయవాడకు చెందిన సాయి, పిల్లి శ్రీనివాస్‌, చంద్రశేఖర్‌, కె శ్రీనులుగా గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా అనంతపురంలో ఒక పెళ్లి మండపం డెకరేషన్‌ కోసం వెళ్లి స్వస్థలం విజయవాడ వస్తుండగా ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
Read Also:
1. పిల్లల భవిష్యత్‌ మీ తీరుపై ఆధారపడి ఉంటుంది..!
2. HYD: ఆస్పత్రి సెక్యూరిటీ మీదకు దూసుకెళ్లిన కారు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి...

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ

YS Jagan Foreign Tour | విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి...