మరో విద్యార్థిని బలిగొన్న ఆన్‌లైన రమ్మీ రక్కసి

-

ఆన్‌లైన్‌ రమ్మీ కారణంగా ఓ విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో జరిగింది. మలైయాండిపట్టికి చెందిన సంతోష్‌ (22) ఓ ప్రైవేటు ఇంజనీరంగ్‌ కాలేజీలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. సరదా కోసం ఆన్‌లైన్‌ రమ్మీను ఆడే సంతోష్‌.. క్రమంగా దానికి బానిసగా మారిపోయాడు. ఈ క్రమంలోనే రమ్మీ ఆడేందుకు డబ్బులు లేకపోవటంతో, తల్లిదండ్రులతో గొడవపడి బంగారు ఉంగరం, కొంత డబ్బు తీసుకొని బయటకు వెళ్లిపోయాడు. ఉంగరాన్ని అమ్మేసి, వచ్చిన డబ్బుతో రమ్మీ ఆడాడు. కానీ అయినా డబ్బు మెుత్తం పోగొట్టుకున్నాడు. దీంతో మనస్తాపం చెంది.. ఆన్‌లైన్‌ రమ్మీకు బానిసగా మారి.. డబ్బునంతా పోగొట్టుకున్నాను.. నా చావుకు కారణం ఆన్‌లైన్‌ రమ్మీ అని వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టి మనప్పారై కీరైతోట్టం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించటంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...