ఫ్లాష్: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..వివాహానికి వెళ్లి వస్తుండగా కుటుంబం మొత్తం బలి

0
41

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..తాజాగా ఆంధ్రప్రదేశ్​లోని అన్నమయ్య జిల్లాలో  జరిగిన ప్రమాదంలో భారీ ప్రాణనష్టం చవిచూడవలసి వస్తుంది. పలమనేరులో పెళ్లి కార్యక్రమానికి వెళ్లి ఆనందంగా తిరిగి వస్తుండగా కారు కల్వర్టును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మదనపల్లె గ్రామీణం పరిధిలోని పుంగనూరు రోడ్డులో చోటుచేసుకుంది.

అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని స్థానికులను విచారించగా..వారందరు ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. మృతిచెందిన వారిని గంగిరెడ్డి, మధులత, కుషితారెడ్డి, దేవాన్ష్‌రెడ్డిలుగా పోలీసులు గుర్తించి..మృతదేహాలను పోస్టుమట్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.