మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

0
133

ఏపీలోని పల్నాడు జిల్లాలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న నాగమల్లేశ్వరి (25)  కంభంపాడు సాగర్ కుడికాలువ వద్ద యాసీడ్ తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.