ఏపీలో నకిలీ పోలీసుల హల్ చల్

0
32

ఏపీలో నకిలీ పోలీసులు హల్ చల్ చేశారు. విశాఖలోని భీమిలీలో ఐదుగురు నకిలీ పోలీసులు ఓ రిసార్ట్ కి వెళ్లి పోలీసులమని చెప్పి రైడ్ చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న వారి వద్ద నుండి రూ.76,900 వసూలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఐదుగురు నకిలీ పోలీసులలో ముగ్గురిని అరెస్ట్ చేయగా..మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేసును సిఐ లక్షణ మూర్తి దర్యాప్తు చేపట్టారు.