కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా..ఇద్దరు మృతి, మరో 30 మందికి గాయాలు

0
39

కర్ణాటక రాష్ట్రంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విజయవాడ నుంచి బెంగళూరుకు బయలుదేరిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోగా..మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మరో 30 మందికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.