తీవ్ర విషాదం..లోయలో పడ్డ మినీ బస్సు..11 మంది మృతి

0
34

రోడ్డుప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. అతివేగం, నిర్లక్ష్యం, రాంగ్ రూట్, తాగి వాహనాలు నడపడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరిగుతున్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సాజిన్ ప్రాంతంలో ఓ మినీ బస్సు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 11 మంది మరణించారు. అనేక మంది గాయపడినట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.