కామారెడ్డి ప్రమాదంపై మోడీ ద్రిగ్భ్రాంతి..మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం

0
74

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అసన్‌పల్లి గేట్ సమీపంలో ఆదివారం రోజున ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.  అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా టాటాఏస్‌ లారీని ఢీకొట్టిన ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడంతో పాటు..పలువురికి గాయాలయ్యాయి.

అయితే ఈ ఘటనపై ప్రధాని మోడీ స్పందిస్తూ మృతి చెందిన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దాంతో పాటు ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడం బాధాకరం అని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని సోమవారం ఉదయం ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

ఈ మేరకు వారికీ ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో..బాధిత కుటుంబాలకు రూ.2 లక్షలు అందజేయాలని నిశ్యయించుకున్నారు. అంతేకాకుండా క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున సహాయం చేసి ఆదుకోవడానికి ముందడుగు వేసారు. ఈ విషయాన్నీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు.