ఫ్లాష్- రెచ్చిపోయిన మావోలు..ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి

0
34

మావోయిస్టుల దాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన ఘటన ఒడిశాలోని నువాపాడా జిల్లాలో చోటు చేసుకుంది. జవాన్లు గస్తీ విధులు నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరపగా ముగ్గురు మృతి చెందారు. మృతులను శిశుపాల్ సింగ్, శివలాల్, ధర్మేంద్ర సింగ్​ గా అధికారులు గుర్తించారు.