పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

0
34

పెద్దపల్లి జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంథని మండలంలోని ఎక్లాస్‌పూర్‌ గాడిదులగండిగుట్ట వద్ద ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టి రోడ్డుపక్కన ఉన్న లోయలో పడింది.

పరకాల డిపోకు చెందిన బస్సు బెల్లపల్లి నుంచి హన్మకొండ వెళ్తుంది. ఈ క్రమంలో గాడిదుల గండి వద్ద ఓ కారును ఢీకొట్టింది. అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, 11 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు.