కరోనా కాటుకు రాలిన మరో సెర్ప్ ఉద్యోగి : కరీంనగర్ లో విషాదం

0
36

SERP ఉద్యోగులను వీడని కరోనా
నేడు కరీంనర్ లో DPM రఘురాం కరోనా తో మృతి

ఇకనైనా SERP లో కారుణ్య నియామకాలు వర్తింప చేయాలి

సెర్ఫ్ ఉద్యోగ సంఘాల జేఏసీ విజ్ఞప్తి..

ఈ 6 నెలల కాలంలో కరోనా వైరస్ బారినపడి 14 మంది సిబ్బంది అకాల మరణం చెందారు అని దీంతో సెర్ప్ సిబ్బంది కుటుంబాలు వీధిన పడుతున్నాయని వీరిని ఆదుకోవడానికి కారుణ్య నియామకాలు చేపట్టాలని SERP ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు కుంట గంగాధర్ రెడ్డి, ఏపురీ నరసయ్య , సుభాష్ గౌడ్ మహేందర్ రెడ్డి లు డిమాండ్ చేశారు..

ఈరోజు కరీంనగర్ జిల్లాలో DPM గా పని చేస్తున్న రఘురామ్ కరోనా తో మరణించాడనీ ఆవేదన వ్యక్తంచేశారు.

ఇలా గత 6నెలల కాలంలో 14మంది SERP ఉద్యోగి అకాల మరణం చెందడం తో ఆ కుటుంబాలు వీధిన పద్దాయని,

ఇది వరకు పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం మరియు ఉన్నత అధికారులు ఇచ్చిన హామీ మేరకు వెంటనే SERP లో కారుణ్య నియామకాలు అమలు చేయాలని ఈ సందర్భంగా లేఖలో విజ్ఞప్తి చేశారు.

మరోపక్క ఆస్పత్రుల్లో వైద్యం పేరుతో పరిమితికి మించి ఖర్చు అవుతోందని కరోణ వైద్యానికి ఇప్పుడున్న హెల్త్ కార్డలపై మొత్తం కుటుంబానికి రు. నాలుగు లక్షల రూ. మాత్రమే కవరేజ్ ఉందని అన్నారు. అయినా క్లెయిమ్ సరిగా అమలు చేయడం లేదన్నారు.

4లక్షలు కాకుండా ఎంత ఖర్చు అయితే అంత సీలింగ్ లేకుండా కుటుంబం మొత్తం ఇన్సూరెన్స్ కార్డ్స్ క్రిందనే కవరేజ్ చేయాలని వినతి పత్రంలో కోరారు.

కరోనా సోకి ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న వారికి మరియు హోం ఐసోలేషన్ లో ఉన్నవారికి ప్రత్యేకంగా మెడికల్ లీవ్ వర్తింపజేయాలని ప్రస్తుతం అలా చేయకుండా వేతనాలు కట్ చేసే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు..

కరోణ ఆపద కాలంలో SERP సిబ్బంది వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, మహిళా సంఘాలకు బ్యాంకు లింకెజి రుణాల పంపిణీ వంటి కార్యక్రమాల్లో ప్రాణాలను లెక్కచేయకుండా విధుల నిర్వహణ చేస్తున్నారని కావున కరోణ వారియర్స్ గా గుర్తించి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం మరణించిన సిబ్బందికి చెల్లించాలని వినతి పత్రం లో కోరారు.