వైఎస్సార్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

-

వైఎస్సార్‌ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. తిరుపతి నుంచి తాడిపత్రి వెళ్తుండగా జరిగిన ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రి, కర్ణాటకలోని బళ్లారికి చెందిన 14 మంది బంధువులు తిరుమలకు తుఫాన్ వాహనంలో వెళ్లారు. శ్రీవారి దర్శనం అనంతరం తాడిపత్రి బయలుదేరారు. కొండాపూర్‌ మండలం ఏటూరు గ్రామానికి సమీపంలో వీరు ప్రయాణిస్తున్న తుఫాన్‌ వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
Read Also: సీబీఐ కొత్త డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్ నియామకం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...