రెడ్ అలర్ట్: ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరిక

-

Temperatures |తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ ప్రతాపంతో పాటు తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. దీంతో ఉక్కబోతతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో వచ్చే ఐదో రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి 19వ తేదీ వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. రాష్ట్రంలో ఆదివారం నల్లగొండలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

- Advertisement -

అటు ఏపీలో కూడా ఎండల(Temperatures) తీవ్రత భారీగా ఉంటుందని అధికారులు తెలిపారు. 127 మండలాల్లో తీవ్రవడగాల్పులు,173 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు ప్రస్తుతం కంటే 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 3 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదవుతాయని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రతో పాటు కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందన్నారు. ఇరు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Read Also: వైఎస్సార్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....