షాకింగ్ న్యూస్ : వ్యాక్సిన్ పేరుతో నిర్మాత సురేష్ బాబుకు టోకరా

0
43

వ్యాక్సిన్ పేరుతో తెలుగు సినీ ఇండస్ట్రీలో పేరుమోసిన నిర్మాతకు ఒక వ్యక్తి టోకరా ఇచ్చాడు. తెలుగు సినీ లోకంలో సంచలనం రేపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇవీ…

నాగార్జున రెడ్డి అనే పర్సన్ సినీ నిర్మాత సురేష్ బాబుకు ఫోన్ చేశాడు.  తన వద్ద 500 డోసుల వ్యాక్సిన్ ఉందని చెప్పాడు. తన భార్య లక్ష్మి బ్యాంకు ఖాతాలోకి లక్ష రూపాయలు బదిలీ చేయాలని కోరాడు. దీంతో ఆ వ్యక్తి మాటలు నమ్మిన ప్రొడ్యూసర్ సురేష్ బాబు వెంటనే ఆయన చెప్పిన బ్యాంకు ఖాతాకు డబ్బులు బదిలీ చేశారు. ఇంకేముంది సదరు నిందితుడు డబ్బులు డ్రా చేసుకుని సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు.

దీంతో తాము మోసపోయామని తెలుసుకున్న నిర్మాత సురేష్ బాబు తేరుకుని పోలీసులను ఆశ్రయించారు. సురేష్ బాబు పర్సనల్ సెక్రటరీ రాజేంద్ర ప్రసాద్ జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సినీ పెద్దలకే టోకరా కొట్టించాడంటే ఆ నాగార్జున రెడ్డి మామూలోడు కాదని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.