ఇంజనీర్లను కిడ్నాప్ చేసిన మావోలు

The Maoists who kidnapped the engineers

0
172

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో ఇద్దరు ఉప కార్యనిర్వాహక ఇంజనీర్లను మావోయిస్టులు కిడ్నాప్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకంలో భాగంగా రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న క్రమంలో గోర్నా మన్కేలి అటవీప్రాంతంలో ఇద్దరు సబ్ఇంజనీర్లను మావోలు కిడ్నాప్ చేశారు.
24 గంటలు గడిచినా వారి ఆచూకీ తెలియలేదు. ఎస్పీ కమలోచన్ కశ్యప్ కు ఈ విషయాన్ని పియంయస్వై కార్యాలయ సిబ్బంది తెలియజేశారు.