ఫ్లాష్: సూర్యాపేట జిల్లాలో పసికందును కిడ్నాప్ చేసిన దుండగులు..

0
33

తెలంగాణాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పాపం పుణ్యం తెలియని బాబుని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్​పల్లిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్ళితే..తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న4 నెలల ఇమ్మారెడ్డి శివ అనే బాబును కొందరు దుండగులు గుట్టు చప్పుడు కాకుండా ఎత్తుకుపోయారు.

తమ కుమారుడు కనిపించకపోయేసరికి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యి చివ్వెంల పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని అనుమానమున్న వ్యక్తులను దర్యాప్తు చేస్తున్నారు. దాంతోపాటు పోలీసులు బృందాలుగా ఏర్పడి దుండగుల కోసం గాలిస్తున్నారు.