Flash News- ఘోర రోడ్డు ప్ర‌మాదం..ముగ్గురు మృతి

Three killed in road mishap

0
32

తెలంగాణ: మేడ్చ‌ల్ జిల్లా కీస‌ర మండ‌లం యాద్గార్‌ప‌ల్లి వ‌ద్ద ఔట‌ర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా వ‌చ్చిన కారు అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో అక్క‌డిక‌క్క‌డే ముగ్గురు మృతి చెంద‌గా, మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌టనాస్థ‌లికి చేరుకున్నారు.

మృతుల‌ను సైబ‌ర్ క్రైమ్ ఏసీపీ ప్ర‌సాద్ కుటుంబ స‌భ్యులుగా పోలీసులు గుర్తించారు. ప్ర‌మాదంలో ఏసీపీ కేవీఎం ప్ర‌సాద్ స‌తీమ‌ణి శంక‌ర‌మ్మ‌, సోద‌రుడి కుమారుడు భాస్క‌ర్ దంప‌తులు మృతి చెందారు. ఏసీపీ సోద‌రుడు బాల‌కృష్ణ‌కు తీవ్ర గాయాల‌య్యాయి. బాల‌కృష్ణ‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.