Flash- విషాదం..అన్నదమ్ముల ప్రాణం తీసిన పబ్​జీ

0
35

సరదా ఆట ప్రాణాలు తీస్తున్నాయి. మొబైల్‌ గేమ్స్‌ కొంతమంది పాలిట శాపంలా మారింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది పబ్‌జీ బారినపడి జీవితాలు పణంగా పెడుతున్నారు. వీడియోగేమ్‌లకు ఆడిక్టయి చిన్నాభిన్నం చేసుకుంటున్నారు.

రాజస్థాన్​, జైపుర్​లో విషాద ఘటన చోటు చేసుకుంది. పబ్ జి ఇద్దరు అన్నదమ్ములను బలిగొంది.వారి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అసలు ఏం జరిగిందంటే.. ‘లోకేశ్​ మీనా, రాహుల్ అనే ఇద్దరు సోదరులు వాళ్ల అక్క ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటున్నారు.

ఖాళీ సమయంలో పబ్​జీ ఆడుతూ కాలక్షేపం చేసేవారు. ఈ క్రమంలో రూప్​బాస్ పట్టణం సమీపంలోని రైలు పట్టాలపై కూర్చొని ఫోన్​లో పబ్​జీ ఆటలో నిమగ్నమయ్యారు. ఇంతలో ఆ మార్గంలో రైలు వచ్చింది. ట్రైన్​ను గమనించని అన్నదమ్ములు అలాగే ఆటలో పూర్తిగా లీనమయ్యారు. దీంతో రైలు వారిని ఢీకొట్టింది’. ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడ దుర్మరణం చెందారు.