రూ.7000 బాకీ కోసం బైక్ పై వెళుతున్న భార్య భర్తలను వీరు ఏం చేశారంటే – దారుణం

ఒకవేళ ఆ భార్య భర్తలు ఇద్దరూ తప్పించుకోకపోతే ఈ దుర్మార్గులు ఆ జంటని చంపేసేవారు

0
42

రాజస్ధాన్ లోని ఓ మహిళ తన భర్తతో కలిసి బార్మర్ నుంచి నకోడాకు బైక్ పై వెళ్తోంది. సరను టోల్ ప్లాజా దగ్గర వారిని చానూరమ్, బాబూరమ్, నేమారమ్ అనే యువకులు ఆపారు. తమకు బాకీ ఉన్న రూ.7 వేలు ఇప్పుడు ఇవ్వాలి అని అడిగారు. దానికి ఆ దంపతులు తమ దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు తర్వాత ఇస్తాము అని చెప్పారు. కాని ఆ ముగ్గురు యువకులు రెచ్చిపోయారు. భార్యాభర్తలను బలవంతంగా ఆ ముగ్గురు కుర్రాళ్లు తమ కారులోకి ఎక్కించుకున్నారు.

వారిని కొన్ని కిలోమీటర్లు ఊరికి దూరంగా తీసుకువెళ్లారు. భర్తని బెదిరించి ముగ్గురు అతని భార్యని రేప్ చేశారు. వారిద్దరిని పెట్రోల్ తో అక్కడే తగలపెట్టాలి అని చూశారు. కాని భార్య భర్తలు ఇద్దరూ కూడా అక్కడ నుంచి తప్పించుకున్నారు. ఒక లారీ వెళుతుంటే అతన్ని లిఫ్ట్ అడిగి భార్య భర్తలు ఇద్దరూ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.

వెంటనే ఫిర్యాదు చేయడంతో ఆ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకవేళ ఆ భార్య భర్తలు ఇద్దరూ తప్పించుకోకపోతే ఈ దుర్మార్గులు ఆ జంటని చంపేసేవారు. ఇంత దారుణం జరగడంతో గ్రామస్తులు వారిని కచ్చితంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతోంది.