Flash: ఏపీలో భర్తను చంపిన భార్య..వివాహితకు యావజ్జీవ జైలు శిక్ష

0
36

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పాసుపాడు లో భర్తను చంపిన వివాహిత కేసు దాదాపు 5 సంవత్సరాలుగా విచారణ సాగుతున్న నేపథ్యంలో..తుదకు హంతకురాలికి  కోర్టు యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చింది. వివాహేతర సంబంధం మోజులో పడి కట్టుకున్న భర్తను అంతమొందించింది.

శ్రీవిద్య, నరేంద్ర అనే వ్యక్తులకు గతంలో పెళ్ళి అయింది. వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భర్త భార్యను మందలించాడు. దీంతో భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకొని సైనైడ్ కలిపిన మందు తాగించారు. దాంతో నరేంద్ర అనే అక్కడిక్కడే మృతి చెందాడు. దానిని ఒక కట్టుకథ అల్లి ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించారు.