వైఎస్ వివేకా హత్య..డ్రైవర్ దస్తగిరి స్టేట్ మెంట్స్ లో వెలుగులోకి సంచలనాలు..

YS Viveka murder: Driver arrested

0
39

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు బయటికొచ్చాయి. సీబీఐ విచారణలో భాగంగా వివేకా హత్యపై దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అందులో వైఎస్ వివేకాను ఎలా హత్య చేసింది వివరించారు దస్తగిరి. వివేకా డ్రైవర్ దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ ప్రకారం అతన్ని నలుగురు హత్య చేశారు.

వివేకా హత్యకు సంబంధించి డ్రైవర్ దస్తగరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ లో వివరాలు ఇలా ఉన్నాయి.

2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి ఓడిపోయాడు.
ఎన్నికల్లో ఓడిపోవడానికి ఎర్రగంగిరెడ్డి మోసం చేశాడని వివేకా ఆగ్రహించాడు.
బెంగళూరులో స్థలం విషయంలో పంచాయతీ కోసం పలుమార్లు వెళ్లేవారు.
ఆ స్థలంలో వాటా కావాలని ఎర్రగంగిరెడ్డి అడిగితే వివేకా ఆగ్రహించాడు.
2018లో నేను వివేకా వద్ద డ్రైవర్ పని మానేశాను.

డ్రైవర్ గా మానేసిన తర్వాత ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ ను తరచూ కలిసేవాడిని.
2019 ఫిబ్రవరి 2న ఎర్రగంగిరెడ్డిన తన ఇంటికి నన్ను, సునీల్ యాదవ్, ఉమశంకర్ రెడ్డిని తీసుకెళ్లాడు.
వివేకాను చంపాలని ఎర్రగంగిరెడ్డి తనకు సూచించాడు. తాను హత్య చేయలేనని చెప్పాను. హత్య  చేయడానికి నీవు ఒక్కడివే కాదు. మేము కూడా వస్తామన్నారు. హత్య వెనక పెద్దల ప్రమేయం ఉందన్నారు.

వై.ఎస్.అవినాష్ రెడ్డి, వై.ఎస్.భాస్కర్ రెడ్డి, వై.ఎస్.మనోహర్ రెడ్డి, డి.శంకర్ రెడ్డి ఉన్నారని ఎర్రగంగిరెడ్డి చెప్పారు. శంకర్ రెడ్డి 40 కోట్లు ఇస్తాడు. అందులో 5 కోట్లు నాకు ఇస్తానని ఎర్రగంగిరెడ్డి చెప్పాడు.
ఇది జరిగిన నాలుగు రోజుల తర్వాత సునీల్ యాదవ్ నాకు కోటి రూపాయలు ఇచ్చాడు. అందులో 25 లక్షలు ఇవ్వాలని మరలా ఇస్తానని సునీల్ చెప్పాడు. 75 లక్షల రూపాయలను మున్నా అనే వ్యక్తి వద్ద దాచి పెట్టాను.

ఇది జరిగిన నాలుగు రోజుల తర్వాత సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి వివేకా ఇంటి కుక్కను కారుతో ఢీకొట్టి చంపేశారు.  నేను కదిరికి వెళ్లి గొడ్డలి కొనుగోలు చేసి సునీల్ యాదవ్ కు ఇచ్చాను. 2019 మార్చి 14వ తేదీ రాత్రి ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, నేను వివేకా ఇంటికి వెళ్లాం.వివేకా ఇంటికి వచ్చిన తర్వాత ఎర్రగంగిరెడ్డి ముందుగా ఇంట్లోకి వెళ్లాడు..తర్వాత మేము ముగ్గురం గోడ దూకి పక్క తలుపు తీసి లోపలికి వెళ్లాం. బెంగళూరు స్థలం విషయంలో వాటా కావాలని ఎర్రగంగిరెడ్డి వివేకాను అడిగాడు.

ఆ సమయంలో వాదన జరగడంతో సునీల్ యాదవ్ బూతులు తిడుతూ వివేకా ముఖంపై కొట్టాడు. కిందపడిన వివేకాను ఉమాశంకర్ రెడ్డి గొడ్డలితో దాడి చేశాడు. వివేకాను గొడ్డలితో దాడి చేసి ఆయన చేత్తో ఓ ఉత్తరం రాయించాము. సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి ఆయన ఇంట్లో కొన్ని పత్రాలు తీసుకున్నారు.
బాత్ రూంలోకి తీసుకెళ్లి వివేకాను గొడ్డలితో నరికి హత్య చేశారు. హత్య చేసిన తర్వాత అంతా గోడ దూకి పారిపోయాం. భయపడవద్దు అవినాష్ రెడ్డి, శంకర్ రెడ్డి చూసుకుంటారని ఎర్రగంగిరెడ్డి మాకు ధైర్యం చెప్పారు.