Akshaya Tritiya | అక్షయ తృతీయ రోజు ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసా?

-

వైశాఖ శుద్ధ తదియను “అక్షయ” తృతీయగా(Akshaya Tritiya) వ్యవహరిస్తారు. అక్షయం అంటే నాశనం లేకపోవడం, దినదినాభివృద్ది చెందడం అని అర్థం. ఈ అక్షయ తృతీయను ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవి స్వయంగా తమ ఇంటికి వస్తుందని భావించి జనాలు బంగారాన్ని కొంటుంటారు. అయితే అంతా శుభప్రదంగా భావించే ఈ అక్షయ తృతీయ రోజున ఇంకా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడే తెలుసుకుందాం.

  • పరశురాముని జన్మదినం ఈరోజే.
  • పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం త్రేతాయుగం మొదలైన రోజు ఇది.
  • శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న రోజు.
  • వ్యాస మహర్షి మహా భారతంను వినాయకుని సహాయముతో రాయడం మొదలుపెట్టిన రోజు.
  • సూర్య భగవానుడు వనవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన రోజు.
  • శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన రోజు.
  • ఆదిశంకరులు “కనకధారాస్తవం”ను చెప్పిన రోజు(Akshaya Tritiya).
  • అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు.
  • ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారి నుండి కాపాడిన రోజు.
Read Also: వేసవిలో జుట్టు రాలకుండా ఈ జాగ్రత్తలు పాటించాలి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పెళ్ళై పిల్లలున్న వ్యక్తితో డేటింగ్‌పై సాయిపల్లవి క్లారిటీ

సాయి పల్లవి(Sai Pallavi) ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నేచురల్ బ్యూటీగా...

అసెంబ్లీలో వాళ్లందర్నీ నిలబెట్టిన సీఎం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని...