Akshaya Tritiya | అక్షయ తృతీయ రోజు ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసా?

-

వైశాఖ శుద్ధ తదియను “అక్షయ” తృతీయగా(Akshaya Tritiya) వ్యవహరిస్తారు. అక్షయం అంటే నాశనం లేకపోవడం, దినదినాభివృద్ది చెందడం అని అర్థం. ఈ అక్షయ తృతీయను ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవి స్వయంగా తమ ఇంటికి వస్తుందని భావించి జనాలు బంగారాన్ని కొంటుంటారు. అయితే అంతా శుభప్రదంగా భావించే ఈ అక్షయ తృతీయ రోజున ఇంకా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడే తెలుసుకుందాం.

  • పరశురాముని జన్మదినం ఈరోజే.
  • పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం త్రేతాయుగం మొదలైన రోజు ఇది.
  • శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న రోజు.
  • వ్యాస మహర్షి మహా భారతంను వినాయకుని సహాయముతో రాయడం మొదలుపెట్టిన రోజు.
  • సూర్య భగవానుడు వనవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన రోజు.
  • శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన రోజు.
  • ఆదిశంకరులు “కనకధారాస్తవం”ను చెప్పిన రోజు(Akshaya Tritiya).
  • అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు.
  • ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారి నుండి కాపాడిన రోజు.
Read Also: వేసవిలో జుట్టు రాలకుండా ఈ జాగ్రత్తలు పాటించాలి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...