మందుబాబులకు షాక్.. మూడు రోజులు మద్యం షాపులు బంద్..

-

Liquor Shops | తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు మందుబాబులు వైన్స్‌ ముందు బారులు తీరుతున్నారు. ఎండ వేడి తట్టుకునేందుకు చల్ల చల్లని బీర్లు తాగుతున్నారు. అయితే అలాంటి మందుబాబులకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. మే 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశాంత వాతావ‌ర‌ణంలో పోలింగ్ జ‌రిగేలా చూసేందుకు రెండు రోజుల పాటు మ‌ద్యం విక్రయాల‌ను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

Liquor Shops | మే 11 శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మే 13న సోమ‌వారం సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు మ‌ద్యం దుకాణాల‌ను మూసివేయాల‌ని ఉత్తర్వులు జారీ చేసింది. వైన్ షాపుల‌తో పాటు బార్లు, కల్లు కాంపౌడ్లు, పబ్‌లు కూడా మూత ప‌డ‌నున్నాయి. అలాగే కౌంటింగ్ రోజైన జూన్ 4న కూడా మద్యం షాపులు మూత‌ప‌డ‌నున్నాయి. పోలింగ్ వేళ ఎలాంటి వివాదాలు, ఉద్రిక్తతలు, ఘర్షణలు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది.

Read Also: రేవంత్ రెడ్డి చిల్లర రాజ‌కీయాలు చేస్తున్నారు: కేటీఆర్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పెళ్ళై పిల్లలున్న వ్యక్తితో డేటింగ్‌పై సాయిపల్లవి క్లారిటీ

సాయి పల్లవి(Sai Pallavi) ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నేచురల్ బ్యూటీగా...

అసెంబ్లీలో వాళ్లందర్నీ నిలబెట్టిన సీఎం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని...