రేవంత్ రెడ్డి చిల్లర రాజ‌కీయాలు చేస్తున్నారు: కేటీఆర్

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిల్లర రాజ‌కీయాలు చేస్తున్నార‌ని మాజీ మంత్రి కేటీఆర్(KTR) మండిప‌డ్డారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్ మ‌న్నె క్రిశాంక్‌(Krishank)తో ములాఖ‌త్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో పెట్టిన సర్క్యులర్, క్రిశాంక్ పెట్టిన సర్క్యులర్ నిపుణుల ముందు పెట్టి, ఏది ఒరిజినల్.. ఏది డూప్లికేట్ అనేది తేలుద్దాం అన్నారు. నిజానిజాలు తేల్చిన తర్వాత మీది తప్పు అయితే మీరు జైలుకు వెళ్లడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. ఇక‌నైనా సిగ్గు తెచ్చుకొని వెంట‌నే క్రిశాంక్‌ను విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు.

- Advertisement -

కాగా ఉస్మానియా యూనివర్సిటీలో నీళ్లు, కరెంట్ బంద్ కారణంగా నెల రోజుల పాటు సెలవులు ఇచ్చారంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఓ సర్క్యులర్ వైరల్ అయింది. గతేడాది సర్క్యులర్ ఎడిట్ చేసి ఓయూ ప్రతిష్టను దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారని చీఫ్ వార్డెన్ శ్రీనివాస్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మే ఒకటో తేదీన సూర్యాపేట టోల్ గేట్ వద్ద క్రిశాంక్, ఓయూ విద్యార్థి నాగేందర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.

Read Also: విదేశీ పర్యటనకు వెళ్లాలి.. అనుమతి కోరిన సీఎం జగన్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పెళ్ళై పిల్లలున్న వ్యక్తితో డేటింగ్‌పై సాయిపల్లవి క్లారిటీ

సాయి పల్లవి(Sai Pallavi) ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నేచురల్ బ్యూటీగా...

అసెంబ్లీలో వాళ్లందర్నీ నిలబెట్టిన సీఎం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని...