విదేశీ పర్యటనకు వెళ్లాలి.. అనుమతి కోరిన సీఎం జగన్

-

ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి(YS Jagan) విదేశీ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరారు. ఈనెల 17 నుంచి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, యూకే వెళ్లేందుకు అనుమతి కావాలని నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. మరోవైపు మే 13న పోలింగ్ ముగియనుండగా.. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. దీంతో ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన జగన్.. పోలింగ్ తర్వాత రిలాక్స్ అయ్యేందుకు విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

- Advertisement -

కాగా అక్రమాస్తుల కేసుల్లో జగన్ బెయిల్ షరతుల్లో భాగంగా విదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. ఇదిలా ఉంటే సీఎంగా జగన్(YS Jagan) బాధ్యతలు చేపట్టిన తర్వాత నాలుగు సార్లు విదేశీ పర్యటనకు వెళ్లారు. తొలిసారి కుటుంబంతో కలిసి ఇజ్రాయెల్‌లోని జెరూసలెం పర్యటనకు వెళ్లారు. రెండో సారి కుమార్తె కాలేజీ జాయినింగ్ కోసం అమెరికా పర్యటనకు వెళ్లారు. మూడోసారి ఫ్యామిలీతో పాటు దావోస్ వెళ్లి అటు నుంచి విహారయాత్రకు వెళ్లారు. నాలుగోసారి లండన్ పర్యటనకు వెళ్లారు. ఆయన లండన్‌లో ఉన్నప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Read Also: చంద్రబాబు నాకు గురువు కాదు.. సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...