ఇండియాలో కొత్తగా 20,409 కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?

0
43

ఇండియాలో కరోనా మహమ్మారి ఎంతటి కల్లోలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మహమ్మారి కొత్త వేరియంట్లుగా పుట్టుకొచ్చి పెను నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటికి మూడు వేవ్ లుగా వచ్చిన ఈ మహమ్మారి ఎందరినో పొట్టనబెట్టుకుంది. ఇక తాజాగా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది.

ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం..గడిచిన 24 గంటల్లో దేశంలో 20,409 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడి మరో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి తాజాగా 17,159 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.5 శాతానికి చేరింది.

మొత్తం కేసులు: 4,39,79,730

మొత్తం మరణాలు: 5,26,258

యాక్టివ్​ కేసులు: 1,43,988

కోలుకున్నవారి సంఖ్య: 4,33,94, 484