ఏపీ ప్రజలకు ఊరట..భారీగా పడిపోయిన కరోనా కేసులు..జిల్లాల వారిగా వివరాలివే..

0
44

ఏపీలో కరోనా విజృంభణ తగ్గింది. గత వారం రోజులుగా కేసుల సంఖ్య తగ్గడం భారీ ఊరట కలిగిస్తుంది. తాజాగా గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా 22,399 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించ‌గా.. 528 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.

గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు క‌రోనా మ‌హమ్మారి వ‌ల్ల మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 14,707 మంది క‌రోనా కాటుకు బ‌లైయ్యారు. అలాగే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 1864 మంది క‌రోనా మహ‌మ్మారి నుంచి కోలుకున్నారు.

గడిచిన 24 గంటల్లో జిల్లాల వారిగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

అనంతపురం  20

చిత్తూరు         40

ఈస్ట్ గోదావరి   101

గుంటూరు  73

వైస్సార్ కడప  27

కృష్ణ   57

కర్నూల్  21

నెల్లూరు   21

ప్రకాశం    32

శ్రీకాకుళం 4

విశాఖపట్నం  31

విజయనగరం 9

వెస్ట్ గోదావరి   92