ఎపిలో పెరిగిన కరోనా కేసులు : బులిటెన్ రిలీజ్, జిల్లాల లిస్ట్ ఇదే

0
35

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులకు సంబంధించి ఆదివారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. కరోనా కేసులు ఆదివారం 4250 నమోదయ్యాయి. శనివారం కేసులతో పోలిస్తే ఇవాళ స్వల్పంగా కేసుల సంఖ్య పెరిగింది.  నిన్న 4147 కేసులు నమోదయ్యాయి. నేడు నమోదైన మరణాల సంఖ్య 33 గా నమోదైంది. నిన్నటికంటే 5 మరణాలు తక్కువగా చోటు చేసుకోవడం కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. అయితే మొన్న శుక్రవారం నమోదైన 4458 కేసులతో పోలిస్తే ఇవాళ వచ్చిన 4250 సంఖ్య తక్కువ అనే చెప్పాలి.

ఇవాళ మొత్తం 95327 నమూనాలు పరీక్షించారు. గత కొద్దిరోజులుగా రాయలసీమలోని చిత్తూరులో అత్యధిక మరణాలు సంభవిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. కానీ ఇవాళ మొదటి స్థానాన్ని కృష్ణా జిల్లా ఆక్రమించింది. ఆదివారం కృష్ణా జిల్లాలో అత్యధిక మరణాలు అంటే 8 మంది మరణించారు. అత్యధిక  కేసుల రికార్డు మాత్రం తూర్పు గోదావరి జిల్లాకే దక్కింది. ఇవాళ తూర్పు గోదావరి జిల్లాలో 890 కేసులు నమోదయ్యాయి.

మరణాల జాబితా చూస్తే కృష్ణాలో 8 మంది, చిత్తూరులో 6, తూర్పు గోదావరిలో 4, శ్రీకాకుళంలో 4, నెల్లూరులో 3, గుంటూరులో 2, కర్నూలులో 2, అనంతపురంలో 1, ప్రకాశంలో 1, విజయనగరంలో 1, పశ్చిమగోదావరిలో 1 చొప్పున మరణించారు. విశాఖపట్నం, కడప జిల్లాల్లో ఇవాళ ఎలాంటి మరణాలు సంభవించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 44773 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రికవరీ అయిన వారు 5570 మంది ఉన్నారు. కరోనా మృతులు 12599 గా నమోదైంది. మొత్తం 18.79 లక్షల్లో 18.22 లక్షల మంది (97శాతం) మంది రికవరీ అయ్యారు.

జిల్లాల వారీగా కేసుల సంఖ్యకు సంబంధించిన చాట్ కింద ఉంది చూడొచ్చు…

అనంతపూర్ 188

చిత్తూరు 673

తూర్పుగోదావరి 890

గుంటూరు 309

వైఎస్సార్ కడప 179

కృష్ణా 399

కర్నూలు 121

నెల్లూరు 193

ప్రకాశం 461

శ్రీకాకుళం 131

విశాఖపట్నం 187

విజయనగరం 102

పశ్చిమ గోదావరి 417

అత్యవసరమైతేనే తప్ప బయటకు వెళ్లవద్దు అని డాక్టర్లు చెబుతున్నారు. వెళ్లిన సందర్భంలో మాస్కులు తప్పనిసరిగా వాడాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి…

రేవంత్ రెడ్డికి పిసిసి : కేసిఆర్ కు కాంగ్రెస్ అధిష్టానం ఝలక్