ఎపిలో కోవిడ్ బులిటెన్ : కేసులు తగ్గుముఖం, 3 జిల్లాల్లో మరణాలు జీరో, లిస్ట్ ఇదే

Andhrapradesh Corona Cases Bulletin Released

0
38

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులు శనివారం నాడు మరింతగా తగ్గుముఖం పట్టాయి. శనివారం 4147 కేసులు నమోదైనట్లు కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయిన బులిటెన్ లో వెల్లడైంది. నేడు నమోదైన మరణాల సంఖ్య 38 గా ఉంది. కేసుల సంఖ్య చూస్తే శుక్రవారం నమోదైన 4458 కేసులతో పోలిస్తే ఇవాళ 4147కేసులు వచ్చాయి అంటే… 300 కేసులు తగ్గాయన్నమాట. ఇక మరణాల సంఖ్య మాత్రం నిన్నటిలాగే కొనసాగింది. నిన్న 38 ఉండగా ఇవాళ కూడా 38 మంది కన్నుమూశారు.
ఇవాళ మొత్తం 96,121 నమూనాలు పరీక్షించారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏడుగురు చొప్పున మరణించారు. కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఎవరూ మరణించకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఎప్పటిలాగే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. 838 కేసులతో తూర్పుగోదావరి మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 46126 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రికవరీ అయిన వారు 5773 మంది ఉన్నారు. కరోనా మృతులు 12566 గా నమోదైంది. మొత్తం 18.75 లక్షల్లో 1816930 మంది రికవరీ అయ్యారు.
నిన్న శుక్రవారం నమోదైన 4458 కేసులు నమోదు కాగా, గురువారం నాడు ప్రభుత్వం వెలువరించిన కోవిడ్ బులిటెన్ లో నమోదైన కేసులు 4981. బుధవారం నమోదైన కేసులు 4684.
మరణాలు చూస్తే… చిత్తూరులో 7, గుంటూరు లో 7, తూర్పు గోదావరిలో 5, కృష్ణా జిల్లాలో 5, శ్రీకాకుళం 4, పశ్చిమగోదావరి 3, అనంతపురం 2, కడప 2, విశాఖపట్నం 2, విజయనగరం 1 చొప్పున మరణాల సంఖ్య నమోదైంది.
జిల్లాల వారీగా కేసుల సంఖ్యకు సంబంధించిన చాట్ కింద ఉంది చూడొచ్చు…
అనంతపూర్ 180
చిత్తూరు 569
తూర్పుగోదావరి 838
గుంటూరు 321
వైఎస్సార్ కడప 226
కృష్ణా 310
కర్నూలు 160
నెల్లూరు 195
ప్రకాశం 289
శ్రీకాకుళం 128
విశాఖపట్నం 229
విజయనగరం 130
పశ్చిమ గోదావరి 571
అత్యవసరమైతేనే తప్ప బయటకు వెళ్లవద్దు అని డాక్టర్లు చెబుతున్నారు. వెళ్లిన సందర్భంలో మాస్కులు తప్పనిసరిగా వాడాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.