ఏపిలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు – బులిటెన్ రిలీజ్

Andhrapradesh Corona Cases Bulletin Released

0
38

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులకు సంబంధించి మంగళవారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. కరోనా కేసులు మంగళవారం 3620 నమోదయ్యాయి. సోమవారం కేసులతో పోలిస్తే ఇవాళ స్వల్పంగా కేసుల సంఖ్య పెరిగింది.  నిన్న 2224 కేసులు నమోదయ్యాయి. నేడు నమోదైన మరణాల సంఖ్య 41 గా నమోదైంది. నిన్నటికంటే 10 మరణాలు సంఖ్య పెరిగింది.

ఇవాళ మొత్తం 91231 నమూనాలు పరీక్షించారు. గత కొద్దిరోజులుగా రాయలసీమలోని చిత్తూరులో అత్యధిక మరణాలు సంభవిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాము.  మంగళవారం చిత్తూరు జిల్లాలో అత్యధిక మరణాలు అంటే 7 మంది మరణించారు. ఇవాళ అత్యధిక  కేసులు తూర్పు గోదావరి జిల్లాలో 617 కేసులు నమోదయ్యాయి.

మరణాల జాబితా చూస్తే చిత్తూరులో 7,  కృష్ణాలో 6 మంది,  తూర్పు గోదావరిలో 5, ప్రకాశంలో 5 , గుంటూరులో 4,  పశ్చిమ గోదావరి 4,  శ్రీకాకుళంలో 3,  అనంతపురంలో 2, విశాఖపట్నం 2 , విజయనగరంలో 1, కర్నూలు 1 , నెల్లూరులో 1,  చొప్పున మరణించారు

కడప జిల్లాలో ఇవాళ ఎలాంటి మరణాలు సంభవించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 40074 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రికవరీ అయిన వారు 5757 మంది ఉన్నారు. కరోనా మృతులు 12671 గా నమోదైంది. మొత్తం 18.85 లక్షల్లో 18.32 లక్షల మంది (97శాతం) మంది రికవరీ అయ్యారు.

జిల్లాల వారీగా కేసుల సంఖ్యకు సంబంధించిన చాట్ కింద ఉంది చూడొచ్చు…

అనంతపూర్ 190

చిత్తూరు 451

తూర్పుగోదావరి 617

గుంటూరు 299

వైఎస్సార్ కడప 137

కృష్ణా 332

కర్నూలు 44

నెల్లూరు 210

ప్రకాశం 386

శ్రీకాకుళం 118

విశాఖపట్నం 176

విజయనగరం 95

పశ్చిమ గోదావరి 565

అత్యవసరమైతేనే తప్ప బయటకు వెళ్లవద్దు అని డాక్టర్లు చెబుతున్నారు. వెళ్లిన సందర్భంలో మాస్కులు తప్పనిసరిగా వాడాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి…

కర్నూలుజిల్లాలో మహిళా కూలీకి దొరికిన వజ్రం- ఎంతకు అమ్మారంటే