ఎపి కోవిడ్ బులిటెన్ రిలీజ్ : జిల్లాల వారీగా కేసుల లిస్ట్ ఇదే

Andhrapradesh Corona Cases Bulletin Released

0
44

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులకు సంబంధించి బుధవారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. ఇవాళ ఆంధ్రాలో నమోదైన కేసుల సంఖ్య 3797. నిన్న మంగళవారం 3620 నమోదైన కేసుల కంటే స్వల్పంగా పెరిగాయి. ఇవాళ 35 మంది మరణించారు.
ఇవాళ మొత్తం 97696 నమూనాలు పరీక్షించారు. గత కొద్దిరోజులుగా రాయలసీమలోని చిత్తూరులో అత్యధిక మరణాలు సంభవిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. బుధవారం నాడు మాత్రం ప్రకాశం జిల్లాలో 8 మంది మరణించగా అత్యధిక మరణాలు చోటు చేసుకున్న జిల్లాగా నమోదైంది. రెండో స్థానంలో చిత్తూరు జిల్లాలో 7 మంది మరణించారు. ఇవాళ అత్యధిక కేసులు తూర్పు గోదావరి జిల్లాలో 874 కేసులు నమోదయ్యాయి.
మరణాల జాబితా ప్రకాశంలో 8, చిత్తూరులో 7, తూర్పు గోదావరిలో 4, శ్రీకాకుళంలో 3, విజయనగరంలో 3, అనంతపురం 2, కృష్ణా జిల్లాలో 2, కర్నూలు 2 , గుంటూరులో 1, నెల్లూరులో 1, విశాఖపట్నంలో 1, పశ్చిమ గోదావరిలో 1 చొప్పున మరణించారు. కడప జిల్లాలో ఇవాళ కూడా ఎలాంటిటి మరణాలు సంభవించలేదు.
ప్రస్తుతం రాష్ట్రంలో 38338 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రికవరీ అయిన వారు 5498 మంది ఉన్నారు. కరోనా మృతుల సంఖ్య ఇప్పటి వరకు 12706 గా నమోదైంది. మొత్తం 18.89 లక్షల్లో 18.38 లక్షల మంది (97శాతం) మంది రికవరీ అయ్యారు.
జిల్లాల వారీగా కేసుల సంఖ్యకు సంబంధించిన చాట్ కింద ఉంది చూడొచ్చు…
అనంతపూర్ 165
చిత్తూరు 488
తూర్పుగోదావరి 874
గుంటూరు 306
వైఎస్సార్ కడప 230
కృష్ణా 182
కర్నూలు 117
నెల్లూరు 221
ప్రకాశం 350
శ్రీకాకుళం 110
విశాఖపట్నం 156
విజయనగరం 105
పశ్చిమ గోదావరి 493
అత్యవసరమైతేనే తప్ప బయటకు వెళ్లవద్దు అని డాక్టర్లు చెబుతున్నారు. వెళ్లిన సందర్భంలో మాస్కులు తప్పనిసరిగా వాడాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి……

ఓ మ‌హిళకు నిమిషాల‌ వ్య‌వ‌ధిలో మూడు డోసుల వ్యాక్సిన్ – చివ‌ర‌కు ఏమైందంటే