Breaking News : ఏపిలో తగ్గిన కరోనా కేసులు : బులిటెన్ రిలీజ్డ్

Ap corona Cases bulletin released

0
41

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ కేసుల తీవ్రత తగ్గుతుంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం నాడు రిలీజైన బులిటెన్ లో వివరాలు చూస్తే… నమోదైన కేసుల సంఖ్య 2982. నిన్న బుధవారం నమోదైన కేసులు 3166. 

అనంతపూర్ , విజయ నగరం, శ్రీకాకుళం ,కర్నూలు జిల్లాల్లో మాత్రం కేసుల సంఖ్య డబుల్ డిజిట్ కే పరిమితమైంది. మిగతా 9 జిల్లాల్లో మాత్రం త్రిబుల్ డిజిట్ లో కేసులు కొనసాగుతున్నాయి.
ఇవాళ కోవిడ్ మరణాల సంఖ్య 27గా నమోదైంది.

ఇవాళ మొత్తం 91070 నమూనాలు పరీక్షించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎప్పటిలాగే కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.  ఇక మరణాల సంఖ్య ప్రకాశం అధికంగా నమోదయ్యాయి. 

జిల్లాల్లో మరణాల సంఖ్య చూస్తే..ప్రకాశంలో 6 మంది, కృష్ణా లో 5,చిత్తూరులో 4 , తూర్పుగోదావరి 4, అనంతపురంలో 2, గుంటూరులో 1,  పశ్చిమ గోదావరిలో 1, శ్రీకాకుళంలో 1, విజయనగరంలో 1,నెల్లూరు 1,  విశాఖపట్నంలో 1 చొప్పున మరణించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 31850 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రికవరీ అయిన వారు 3461 మంది ఉన్నారు. కరోనా మృతుల సంఖ్య ఇప్పటి వరకు 12946 గా నమోదైంది.
జిల్లాల వారీగా కేసుల సంఖ్యకు సంబంధించిన చాట్ కింద ఉంది చూడొచ్చు…

అనంతపూర్ 95
చిత్తూరు 401
తూర్పుగోదావరి 616
గుంటూరు 242
వైఎస్సార్ కడప 120
కృష్ణా 298
కర్నూలు 32
నెల్లూరు 208
ప్రకాశం 345
శ్రీకాకుళం 92
విశాఖపట్నం 120
విజయనగరం 50
పశ్చిమ గోదావరి 363