Carona Update: తగ్గిన యాక్టివ్ కేసులు..పెరిగిన మరణాలు..తాజా హెల్త్ బులెటిన్ రిలీజ్

0
45

భారత్ లో కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతాఇంతా కాదు. ఈ మహమ్మారి దెబ్బకు వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన ఈ మహమ్మారి ఎంతోమందిని పొట్టనబెట్టుకున్నాయి. ఇక తాజాగా కేంద్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం..గత 24 గంటల్లో..4.510 కేసులు నమోదు అయ్యాయి.

ఇక ఈ మహమ్మారి బారిన పడి మరో 33 మంది మరణించారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉన్నాయి. యాక్టివ్ కేసుల శాతం 0.10గా ఉన్నాయి.  కరోనా ఇంకా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టలేదని, బయటకు వెళ్తే మాస్క్ పెట్టుకోవడం సహా ఇతర జాగ్రత్తలు తీసుకొవాలని నిపుణులు సూచిస్తున్నారు.